తెలంగాణలో3 రోజులు భగభగ!
- May 29, 2024
హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ మరో 4, 5 రోజులు ఎండలు, వడగాలులు కొనసాగుతాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు 3, 4 రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనేది నానుడి. అయితే ఈసారి భారీ ఉష్ణోగ్రతలు ఉండబోవని IMD వెల్లడించింది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభం కాగా అదే సమయంలో బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ ఏర్పడింది. దీనివల్ల గాలిలో తేమ ఉండటంతోపాటు గంటకు 30-40KM వేగంతో రాష్ట్రంపైకి పశ్చిమ గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతుందని, వడగాలులు ఉండవని తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలను ఉష్ణోగ్రతలు అల్లాడిస్తున్నాయి. వచ్చే 3 రోజుల పాటు ఇవి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, గుజరాత్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది. ఎప్పుడూ చల్లగా ఉండే హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో సైతం తాజాగా 30.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం గమనార్హం.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!