అబుదాబిలో ‘దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్’ మూసివేత

- June 08, 2024 , by Maagulf
అబుదాబిలో ‘దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్’ మూసివేత

యూఏఈ: అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ADAFSA) ఆహార భద్రత మరియు పరిశుభ్రత ఉల్లంఘన కోసం ఎమిరేట్‌లోని “దేశీ పాక్ పంజాబ్ రెస్టారెంట్” ను మూసివేసింది. ఆహారం తయారీ ప్రాంతంలో అపరిశుభ్రత ఉన్నట్లు తనిఖీ బృందం గుర్తించిందని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే రెస్టారెంట్‌లో వెంటిలేషన్, సాధారణ శుభ్రత కూడా లేదని వెల్లడించింది.

అబుదాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గత సంవత్సరం 103,000 తనిఖీలను నిర్వహించింది. అబుదాబి నగరంలో 63,690 సందర్శనలు, అల్ ఐన్ సిటీలో 29,583, అల్ ధాఫ్రా ప్రాంతంలో 9,998 తనిఖీలు చేపట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com