ఇండియా-ఒమన్ సముద్ర రక్షణ సంబంధాలు బలోపేతం

- June 08, 2024 , by Maagulf
ఇండియా-ఒమన్ సముద్ర రక్షణ సంబంధాలు బలోపేతం

న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ (IN), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) మధ్య 6వ ఎడిషన్ స్టాఫ్ చర్చలు జూన్ 4 నుండి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సముద్ర ప్రాంతంలో భారత్ - ఒమన్ మధ్య ప్రస్తుతం ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్టు తెలిపింది.  RNO నుండి ప్రతినిధి బృందానికి జాసిమ్ మొహమ్మద్ అలీ అల్ బలూషి నాయకత్వం వహించారు. భారతదేశం నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి కమోడోర్ (FC) మన్మీత్ సింగ్ ఖురానా నాయకత్వం వహించారు. రెండు చారిత్రక సముద్ర దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి నేవీ-టు-నేవీ స్టాఫ్ చర్చలు సాగాయని పేర్కొంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com