కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ..

- June 24, 2024 , by Maagulf
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తో సీఎం రేవంత్ భేటీ..

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల బృందం ఇవాళ‌ భేటీ అయ్యారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై రాజ్ నాథ్ సింగ్ తో ఈ భేటీలో చర్చించారు. హైదరాబాద్ లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు అప్పగించాలని కోరారు.

కాగా, సాయంత్రం 6.15 గంటలకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌తో సీఎం భేటీ కానున్నారు. సీఎం వెంట కాంగ్రెస్ ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి, బలరాం నాయక్, మల్లురవి, సురేష్ షెట్కార్ తదితరులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com