కొత్త లోగోకు సీఎం రేవంత్ ఆమోదం
- June 29, 2024
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న హరితహారం కార్యక్రమాన్ని 'వన మహోత్సవం'గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన లోగోను ప్రభుత్వం ఆవిష్కరించింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ లోగోను ముఖ్యమంత్రి ఆమోదించారు. వర్షా కాలం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణ, పల్లె ప్రాంతాల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నిజానికి వన మహోత్సవం పేరు గతంలోనే ఉండేది. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే 75 సంవత్సరాలు పూర్తిచే సుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి 'వజ్రోత్సవ వన మహోత్సవం'గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తపేరు పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు, నాటిన మొక్కల సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







