భద్రాద్రి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభం
- July 02, 2024
దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 9.30 వరకు, మళ్లీ రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఈ సమయంలో స్వామి వారి ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలివేయనున్నారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను రూ.200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్లు, అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంచారు..
రాములవారి దర్శన వేళలు చూస్తే..
* రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
* ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. అనంతరం 8.35 నుంచి 9 వరకు సహస్ర నామార్చన.
* ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు అర్చనలు ఉంటాయి.
* ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు నిత్యకల్యాణం ప్రారంభమవుతుంది.
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు.
* మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు.
* రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు నివేదన, అనంతరం పవళింపు సేవ ఉంటుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









