సంక్షేమానికి కేరాఫ్ వైయస్సార్
- July 08, 2024
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రజా బలంతో ప్రభావితం చేసిన అతికొద్ది మంది నేతల్లో ఒకరు వైయస్సార్ అలియాస్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఒకరు. నేడు వైఎస్ జన్మదినం సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి క్లుప్తంగా మీకు కోసం.
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగమైన ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందులలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి, తండ్రి ప్రోద్బంతో వైద్య విద్యను పూర్తి చేసి తమ ప్రాంతంలోనే వైద్యునిగా స్థిరపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవను అందించారు.
వైయస్సార్ యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టి అనంతరం 1978 లో రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలి సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.అనంతరం రెడ్డి కాంగ్రెస్ నుండి ఇందిరా గాంధీ ఆధ్వర్యం లోని కాంగ్రెస్ పార్టీ లో చేరి రాజకీయంగా ఎదుగుతూ వచ్చారు. నెహ్రూ - గాంధీల కుటుంబం పట్ల విధేయుడిగా ఉంటూ పార్టీ పరంగా అనేక ఉన్నత పదవులను అలంకరించారు. కేవలం 35 ఏళ్లకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (పిసిసి) అధ్యక్షుడిగా ఎన్నికైన ఘనత సైతం వీరికే సొంతం.
2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.
4 సార్లు లోక్ సభ సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించిన వైయస్సార్ మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ముఖ్యమంత్రిగా వైయస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలు ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో లబ్ది పొందారు. ఆయా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకున్న చరిష్మా కారణంగానే ఆయన తనయుడు జగన్ సైతం రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి కాగలిగాడు.
సంక్షేమ పథకాల ద్వారా పేదల పెన్నిధిగా నిలిచిన వైయస్సార్ లాంటి నాయకుడు తెలుగు రాజకీయాల్లో మరొకరు లేకపోవడం గమనార్హం. 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









