ముంబైలో భారీ వర్షాలు..విద్యాసంస్థలకు సెలవు
- July 08, 2024
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి.దీంతో.. నగరంలోని రోడ్లు మొత్తం జలమయం అయ్యాయి. నదులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా ముంబై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిలో ప్రయాణం ముందకు సాగడం లేదు. సోమవారం తెల్లవారజాము నుంచే వర్షాలు భారీగా పడుతున్నాయి. దాంతో.. భారీ వర్షంతో నగరం మునిగిపోయింది. పలు ప్రాంతాల్లో కార్లు ,బైకులు నీళ్లలో మునిగిపోయాయి.
ముంబైలో ఉదయం 7 గంటల ప్రాంతంలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అంధేరి, కుర్లా, భందూప్ర, కింగ్స్ సర్కిల్, దాదర్తో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షానికి డ్రెయినేజీలు ఉప్పొంగుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పట్టాలపైన కూడా పెద్ద స్థాయిలో నీరు నిలిచపోయింది. ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదనీరు పట్టాలపై ప్రవహిస్తుండటంతో సబర్బన్ రైల్ సర్వీసులను రద్దు చేసినట్లు చెప్పారు. తాత్కాలికంగా ఈ రద్దు కొనసాగుతుంది చెప్పారు. అలాగే ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా అధికారులు నిలిపివేశారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ముంబయిలోని ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, కాలేజ్లకు మున్సిపల్ కార్పొరేషన్ హాలీడేగా ప్రకటించింది.
ముంబై మాత్రమే కాదు.. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అందుబాటులో ఉండేలా సిబ్బంది సిద్ధం అయ్యారు. థానే, వాసయ్, రాయ్గఢ్, చిప్లున్, కొల్హాపూర్, సాంగ్లి, సతారా ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీలో జూన్ 14 నుండి ఎంటర్ ప్రెన్యూర్షిప్ వీక్..!!
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా









