ఈ ఏడాది రికార్డు సృష్టించనున్న ఖరీఫ్ ఫెస్టివల్..!
- July 14, 2024
సలాలా: ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్కు ఒక మిలియన్ మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతానికి పెరుగుతున్న ఆకర్షణను నొక్కిచెప్పే రికార్డ్-బ్రేకింగ్ సంఖ్య అని అధికారులు తెలిపారు. జూన్ 21న ప్రారంభమై మూడు నెలల పాటు కొనసాగే ఈ సంవత్సరం ఉత్సవాల కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ శాఖలు మరియు ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో వివిధ పర్యాటక ప్రదేశాలను మెరుగుపరచడానికి విస్తృత ప్రయత్నాలతో సన్నాహాలు ప్రారంభమయ్యాయని ధోఫర్ మునిసిపాలిటీ చైర్మన్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహ్సిన్ అల్ ఘస్సానీ తెలిపారు.
ఈ సంవత్సరం ప్రధాన ఆకర్షణలలో సలాలాలోని అవ్కాద్ పబ్లిక్ పార్క్, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అంతర్జాతీయ వినోద గ్రామాలు, ఇంటరాక్టివ్ గేమ్లను కలిగి ఉంది. సలాలాలోని అటీన్ ప్లెయిన్ ఆధునిక పర్యాటక నమూనాను అందించడంతోపాటు వ్యాపారవేత్తలకు సేవలందించే 60 సైట్లను ప్రదర్శిస్తున్నారు. అటీన్ స్క్వేర్ ఓపెనింగ్, సందర్శకులను ఆహ్లాదపరుచనుంది. రెస్టారెంట్లు, కేఫ్ల కోసం 200 కియోస్క్ లను ఏర్పాటు చేశారు. ఖరీఫ్ ధోఫర్ 2022లో 813,000 నుండి 2023లో 962,000 మంది సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!







