ఈ ఏడాది రికార్డు సృష్టించనున్న ఖరీఫ్ ఫెస్టివల్..!
- July 14, 2024
సలాలా: ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్కు ఒక మిలియన్ మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. ఇది ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతానికి పెరుగుతున్న ఆకర్షణను నొక్కిచెప్పే రికార్డ్-బ్రేకింగ్ సంఖ్య అని అధికారులు తెలిపారు. జూన్ 21న ప్రారంభమై మూడు నెలల పాటు కొనసాగే ఈ సంవత్సరం ఉత్సవాల కోసం సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ శాఖలు మరియు ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో వివిధ పర్యాటక ప్రదేశాలను మెరుగుపరచడానికి విస్తృత ప్రయత్నాలతో సన్నాహాలు ప్రారంభమయ్యాయని ధోఫర్ మునిసిపాలిటీ చైర్మన్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహ్సిన్ అల్ ఘస్సానీ తెలిపారు.
ఈ సంవత్సరం ప్రధాన ఆకర్షణలలో సలాలాలోని అవ్కాద్ పబ్లిక్ పార్క్, పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అంతర్జాతీయ వినోద గ్రామాలు, ఇంటరాక్టివ్ గేమ్లను కలిగి ఉంది. సలాలాలోని అటీన్ ప్లెయిన్ ఆధునిక పర్యాటక నమూనాను అందించడంతోపాటు వ్యాపారవేత్తలకు సేవలందించే 60 సైట్లను ప్రదర్శిస్తున్నారు. అటీన్ స్క్వేర్ ఓపెనింగ్, సందర్శకులను ఆహ్లాదపరుచనుంది. రెస్టారెంట్లు, కేఫ్ల కోసం 200 కియోస్క్ లను ఏర్పాటు చేశారు. ఖరీఫ్ ధోఫర్ 2022లో 813,000 నుండి 2023లో 962,000 మంది సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు









