పల్లీలతో వెన్ను నొప్పి దూరం చేసుకోవడమెలా.?
- July 16, 2024
కొన్ని రకాల నొప్పులకు వైద్య చికిత్సతో పాటూ కొన్ని రకాల ఇంటి చిట్కాలు కూడా అవసరమవుతాయ్. అందులో ఒకటి పల్లీలు. పల్లీలతో పాటూ, నువ్వులు, బెల్లం కలిపి తీసుకునే ఆహారం వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రొటీన్లతో పాటూ, మోనో పాలీ అన్ శాచురేటెట్ ఫ్యాట్స్ వుంటాయ్. ఇవి ఎముకల్ని ధృఢంగా మార్చేందుకు సహకరిస్తాయ్. అలాగే విటమిన్ ఇ, బి1, బి3, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి మూలకాలూ కూడా పుష్కలంగా వుంటాయ్.
ఇవి కీళ్ల నొప్పితో పాటూ, దీర్ఘకాలిక వెన్ను నొప్పిని సైతం తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నువ్వుల్లో ఎన్నో రకాల పోషకాలున్నాయ్.
ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్ ఇ, బి పుష్కలంగా వుంటాయ్. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. కాల్షియం, జింక్ కూడా పుష్కలంగా లభించే నువ్వులు తినడం వల్ల రుమాటిజం వంటి సమస్యలు కూడా దూరమవుతాయ్.
అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఎక్కువే. ఇవి సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో తోడ్పడతాయ్.
ఈ మూడు రకాలు కలిపి చేసిన వంటకాలను డైలీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఎముకలు గట్టిపడి ఏ రకమైన నొప్పులైనా దూరమవుతాయని తాజా సర్వేలో తేలింది.
అలాగే దీర్ఘకాలంగా వెన్ను నొప్పితో బాధపడే వారు ఖచ్చితంగా ఈ మూడు పదార్ధాలను కలిపి రోజూ తగిన మోతాదులో తీసుకోవడం మంచి ఫలితం వుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







