భారత్ చేజారిన ఆసియా కప్..
- July 28, 2024
శ్రీలంక: మహిళల ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియాపై శ్రీలంక మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 165-6 స్కోర్ చేసింది.
భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ 16, స్మృతి మంధాన 60, ఉమా ఛెత్రీ 9, హర్మన్ ప్రీత్ 11, రొడ్రిగ్యుస్ 29, రిచా ఘోష్ 30, పూజా 5 (నాటౌట్), రాధా జాదవ్ 1 పరుగులు తీశారు.
లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే గెలుపొందింది. శ్రీలంక జట్టులో చమరి 61, హర్షిత 69 ధాటిగా ఆడారు. టీమిండియా బౌలర్లలో దీప్తి ఒక వికెట్ తీసింది.
భారత జట్టు:
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్
శ్రీలంక జట్టు:
విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని, హాసిని పెరీరా, సుగండిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసల
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







