రామ్ డైరెక్టర్తో రవితేజ సినిమా.!
- August 01, 2024
రామ్ పోతినేని కాంబినేషన్లో వరుసగా మూడు సినిమాలు తెరకెక్కించాడు దర్శకుడు కిశోర్ తిరుమల. అందులో డెబ్యూ మూవీ ‘నేను శైలజ’ అటు రామ్కీ, ఇటు కిషోర్ తిరుమలకు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది.
అదే స్పీడుతో ఆ తర్వాత ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమా చేశారు.ఈ సినిమా సో సోగానే ఆడింది. కానీ, ఓ ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీలో వస్తే.. ఆనందంగా వీక్షించే ఆడియన్స్ వున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి ‘రెడ్’ సినిమా వచ్చింది ఇదే కాంబినేషన్లో. రామ్ పోతినేని డబుల్ రోల్ పోషించాడు ఈ సినిమాలో. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అసలు మ్యాటర్ ఏంటంటే, ‘రెడ్’ తర్వాత మరో మాస్ స్టోరీ రాసుకున్నాడట కిషోర్ తిరుమల.
ఆ స్టోరీ మీదే రెండేళ్లకు పైగా వర్క్ చేస్తున్నాడు. ఆ స్టోరీ ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ హీరోగా నటించబోతున్నాడనీ తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఆగస్టు 15న రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. అలాగే రవితేజ చేతిలో గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఒకటి వుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..