యూఏఈలో వీసా క్షమాభిక్ష.. ప్రవాస కుటుంబాలు హర్షం

- August 02, 2024 , by Maagulf
యూఏఈలో వీసా క్షమాభిక్ష.. ప్రవాస కుటుంబాలు హర్షం

యూఏఈ:  రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించనున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ సమయంలో ఉల్లంఘించిన వారి వీసా స్థితిని క్రమబద్ధీకరించుకోవచ్చు. క్షమాభిక్ష పథకంపై చాలా మంది ప్రవాసుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  యూఏఈ ఆరేళ్ల క్రితం ఆగస్ట్ 1, 2018న మూడవ రెసిడెన్సీ క్షమాభిక్ష పథకాన్ని ప్రారంభించింది. ఇది వేలాది మందికి ఉపయోగపడింది. చాలా మంది రెసిడెన్సీ ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకోవడంతోపాటు దేశం విడిచి వెళ్లారు. 

చివరిసారి ఎమిరేట్స్ వ్యాప్తంగా క్షమాభిక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దుబాయ్‌లో అల్ అవీర్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA)లో కేంద్రానికి వేలాది మంది నివాసితులు తరలివచ్చారు.  క్షమాభిక్ష పొందేందుకు ముందుగా వచ్చిన వారిలో 60 ఏళ్ల పాకిస్థానీ జెహెర్ జహాన్ ఉన్నారు. అతను 30 ఏళ్లుగా యూఏఈలో కార్పెంటర్‌గా పని చేస్తున్నారు. దీంతో ఇంటికి వెళ్లి తన జీవిత చివరి రోజుల్లో తన కుటుంబంతో కలిసి ఉండాలన్న కోరిక నెరవేరింది.  అలా చాలా మంది భారతీయులు, పాకిస్థానీయులు, శ్రీలంక వాసులు, బంగ్లాదేశీయులు మరియు ఫిలిపినోలు తమ దేశాలకు వెళ్లి తమ కుటుంబాలను కలుసుకున్నారు. అనేక మందికి జరిమానాలను రద్దు చేశారు. ఇన్నాళ్లకు క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించడంతో యూఏఈలో ఉంటున్న ప్రవాసుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com