యూఏఈలో వీసా క్షమాభిక్ష.. ప్రవాస కుటుంబాలు హర్షం
- August 02, 2024
యూఏఈ: రెండు నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించనున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ సమయంలో ఉల్లంఘించిన వారి వీసా స్థితిని క్రమబద్ధీకరించుకోవచ్చు. క్షమాభిక్ష పథకంపై చాలా మంది ప్రవాసుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యూఏఈ ఆరేళ్ల క్రితం ఆగస్ట్ 1, 2018న మూడవ రెసిడెన్సీ క్షమాభిక్ష పథకాన్ని ప్రారంభించింది. ఇది వేలాది మందికి ఉపయోగపడింది. చాలా మంది రెసిడెన్సీ ఉల్లంఘించినవారు తమ స్థితిని సరిదిద్దుకోవడంతోపాటు దేశం విడిచి వెళ్లారు.
చివరిసారి ఎమిరేట్స్ వ్యాప్తంగా క్షమాభిక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దుబాయ్లో అల్ అవీర్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA)లో కేంద్రానికి వేలాది మంది నివాసితులు తరలివచ్చారు. క్షమాభిక్ష పొందేందుకు ముందుగా వచ్చిన వారిలో 60 ఏళ్ల పాకిస్థానీ జెహెర్ జహాన్ ఉన్నారు. అతను 30 ఏళ్లుగా యూఏఈలో కార్పెంటర్గా పని చేస్తున్నారు. దీంతో ఇంటికి వెళ్లి తన జీవిత చివరి రోజుల్లో తన కుటుంబంతో కలిసి ఉండాలన్న కోరిక నెరవేరింది. అలా చాలా మంది భారతీయులు, పాకిస్థానీయులు, శ్రీలంక వాసులు, బంగ్లాదేశీయులు మరియు ఫిలిపినోలు తమ దేశాలకు వెళ్లి తమ కుటుంబాలను కలుసుకున్నారు. అనేక మందికి జరిమానాలను రద్దు చేశారు. ఇన్నాళ్లకు క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించడంతో యూఏఈలో ఉంటున్న ప్రవాసుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!









