డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల..
- August 04, 2024
హైదరాబాద్: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపుదిద్దుకున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
రామ్ పోతినేని యాటిట్యూడ్, కామెడీని ట్రైలర్ లో చూపించారు. అతడి మేనరిజం అదుర్స్ అనిపిస్తోంది.రామ్ పోతినేనిపై విలన్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు ఇందులో చూపించారు. ‘ఇప్పుడు నా బ్రెయిన్.. నీ బ్రెయిన్లోకి వెళ్లబోతుంది’ అంటూ సంజయ్ దత్ డైలాగ్ చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. చివరలో శివలింగం ముందు చేసిన ఫైటింగ్ సీన్ హైలైట్ గా కనపడుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా కావ్యా థపర్, విలన్గా సంజయ్ దత్ నటించాడు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా యూనిట్ విశాఖలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్పై నిర్మించారు. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







