డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల..
- August 04, 2024
హైదరాబాద్: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపుదిద్దుకున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
రామ్ పోతినేని యాటిట్యూడ్, కామెడీని ట్రైలర్ లో చూపించారు. అతడి మేనరిజం అదుర్స్ అనిపిస్తోంది.రామ్ పోతినేనిపై విలన్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు ఇందులో చూపించారు. ‘ఇప్పుడు నా బ్రెయిన్.. నీ బ్రెయిన్లోకి వెళ్లబోతుంది’ అంటూ సంజయ్ దత్ డైలాగ్ చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. చివరలో శివలింగం ముందు చేసిన ఫైటింగ్ సీన్ హైలైట్ గా కనపడుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్గా కావ్యా థపర్, విలన్గా సంజయ్ దత్ నటించాడు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా యూనిట్ విశాఖలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్పై నిర్మించారు. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









