కేరళ బాధితులకు కువైట్ సంతాపం

- August 05, 2024 , by Maagulf
కేరళ బాధితులకు కువైట్ సంతాపం

కువైట్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్.. దక్షిణ భారతదేశంలో భారీ కొండచరియలు విరిగిపడిన బాధితులకు తన  సంతాపాన్ని తెలియజేసింది. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంతాపాన్ని తెలిపారు.

ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, తప్పిపోయిన వ్యక్తులు క్షేమంగా తిరిగి రావాలని అమీర్ ఆకాంక్షించారు. హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాహ్ మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా కూడా భారత అధ్యక్షుడికి ఇదే విధమైన సంతాపాన్ని తెలిపారు.

ఇదిలా ఉండగా, కేరళలోని వాయనాడ్ జిల్లాలో జూలై 30న సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 360 దాటింది. ఇంకా అనేక మంది శిథిలాల మధ్య చిక్కుకుపోయి ఉంటారనే భయంతో శోధన మరియు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com