బీఎస్ ఎన్ ఎల్ వినియోగదారులకు ఒక తీపి కబురు
- June 16, 2016
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ ఎన్ ఎల్)ప్రీపేయిడ్, పోస్ట్ పేయిడ్ వినియోగదారుల కోసం ఒక తీపి కబురు అందించింది. గత ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఫ్రీ రోమింగ్ సర్వీసును మరో ఏడాది పొడిగించినట్టు ప్రకటించింది. వినియోగదారుల సౌకర్యార్థం 'ఉచిత నేషనల్ రోమింగ్' సేవను విస్తరించడానికి నిర్ణయించామని బిఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి స్కీంతో వినియోగదారులనుంచి అనూహ్యమైన స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ వెల్లడించారు. ట్రాయ్ నివేదిక ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక వృద్ధిని సాధించామన్నారు.
కాగా ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు గాను బీఎస్ఎన్ఎల్ ఇదివరకే ప్రవేశపెట్టిన ఉచిత కాల్స్ పథకంతో మంచి ఆదరణ లభించింది. దీనికి తోడు ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం సంస్థకు భారీ ఊతమిచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







