ఖతార్ కు రికార్డు స్థాయిలో పోటెత్తిన పర్యాటకులు..!
- August 06, 2024
దోహా: సరళీకృత వీసా విధానాలు, అనేక టూరిజం ఆఫర్లు వెరసి ఖతార్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పర్యాటకులు, సందర్శకులను స్వాగతిస్తోంది. ఖతార్ టూరిజం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూలై 2024లో 317,000 మంది టూరిస్టులు వచ్చారు. ఏడు నెలల కాలంలో సందర్శకుల సంఖ్యను 2.956 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26.2 శాతం పెరిగింది. 2023లో అత్యధికంగా నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు. 0.86 మిలియన్ల మంది సందర్శకులతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. 238,000 మంది సందర్శకులతో ఇండియా తర్వాతి స్థానంలో ఉండగా, 135,000 మంది సందర్శకులతో బహ్రెయిన్ మూడవ స్థానంలో ఉంది. ఇతర అగ్ర దేశాల జాబితాలో కువైట్, ఒమన్, అమెరికా, యూకే, యూఏఈ, జర్మనీ మరియు చైనా ఉన్నాయి.
హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా విజిట్ వీసా విధానాలను సులభతరం చేయడం పర్యాటక రంగం వృద్ధికి కీలకమైనది. ఖతార్ 102 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. మిగిలిన వారు హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా ఇ-వీసా పొందవచ్చు. గత సంవత్సరం ప్రయాణ, పర్యాటక రంగ GDP సహకారం 31 శాతం పెరిగి QR81.2bnకి చేరుకుంది. ఇది మొత్తం GDPలో 10.3 శాతానికి సమానం అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









