ఖతార్ కు రికార్డు స్థాయిలో పోటెత్తిన పర్యాటకులు..!
- August 06, 2024
దోహా: సరళీకృత వీసా విధానాలు, అనేక టూరిజం ఆఫర్లు వెరసి ఖతార్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పర్యాటకులు, సందర్శకులను స్వాగతిస్తోంది. ఖతార్ టూరిజం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూలై 2024లో 317,000 మంది టూరిస్టులు వచ్చారు. ఏడు నెలల కాలంలో సందర్శకుల సంఖ్యను 2.956 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26.2 శాతం పెరిగింది. 2023లో అత్యధికంగా నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు. 0.86 మిలియన్ల మంది సందర్శకులతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. 238,000 మంది సందర్శకులతో ఇండియా తర్వాతి స్థానంలో ఉండగా, 135,000 మంది సందర్శకులతో బహ్రెయిన్ మూడవ స్థానంలో ఉంది. ఇతర అగ్ర దేశాల జాబితాలో కువైట్, ఒమన్, అమెరికా, యూకే, యూఏఈ, జర్మనీ మరియు చైనా ఉన్నాయి.
హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా విజిట్ వీసా విధానాలను సులభతరం చేయడం పర్యాటక రంగం వృద్ధికి కీలకమైనది. ఖతార్ 102 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. మిగిలిన వారు హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా ఇ-వీసా పొందవచ్చు. గత సంవత్సరం ప్రయాణ, పర్యాటక రంగ GDP సహకారం 31 శాతం పెరిగి QR81.2bnకి చేరుకుంది. ఇది మొత్తం GDPలో 10.3 శాతానికి సమానం అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







