ఖతార్ కు రికార్డు స్థాయిలో పోటెత్తిన పర్యాటకులు..!
- August 06, 2024
దోహా: సరళీకృత వీసా విధానాలు, అనేక టూరిజం ఆఫర్లు వెరసి ఖతార్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పర్యాటకులు, సందర్శకులను స్వాగతిస్తోంది. ఖతార్ టూరిజం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూలై 2024లో 317,000 మంది టూరిస్టులు వచ్చారు. ఏడు నెలల కాలంలో సందర్శకుల సంఖ్యను 2.956 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26.2 శాతం పెరిగింది. 2023లో అత్యధికంగా నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు. 0.86 మిలియన్ల మంది సందర్శకులతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. 238,000 మంది సందర్శకులతో ఇండియా తర్వాతి స్థానంలో ఉండగా, 135,000 మంది సందర్శకులతో బహ్రెయిన్ మూడవ స్థానంలో ఉంది. ఇతర అగ్ర దేశాల జాబితాలో కువైట్, ఒమన్, అమెరికా, యూకే, యూఏఈ, జర్మనీ మరియు చైనా ఉన్నాయి.
హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా విజిట్ వీసా విధానాలను సులభతరం చేయడం పర్యాటక రంగం వృద్ధికి కీలకమైనది. ఖతార్ 102 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. మిగిలిన వారు హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా ఇ-వీసా పొందవచ్చు. గత సంవత్సరం ప్రయాణ, పర్యాటక రంగ GDP సహకారం 31 శాతం పెరిగి QR81.2bnకి చేరుకుంది. ఇది మొత్తం GDPలో 10.3 శాతానికి సమానం అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి