ఖతార్ కు రికార్డు స్థాయిలో పోటెత్తిన పర్యాటకులు..!
- August 06, 2024
దోహా: సరళీకృత వీసా విధానాలు, అనేక టూరిజం ఆఫర్లు వెరసి ఖతార్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పర్యాటకులు, సందర్శకులను స్వాగతిస్తోంది. ఖతార్ టూరిజం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూలై 2024లో 317,000 మంది టూరిస్టులు వచ్చారు. ఏడు నెలల కాలంలో సందర్శకుల సంఖ్యను 2.956 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26.2 శాతం పెరిగింది. 2023లో అత్యధికంగా నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు. 0.86 మిలియన్ల మంది సందర్శకులతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. 238,000 మంది సందర్శకులతో ఇండియా తర్వాతి స్థానంలో ఉండగా, 135,000 మంది సందర్శకులతో బహ్రెయిన్ మూడవ స్థానంలో ఉంది. ఇతర అగ్ర దేశాల జాబితాలో కువైట్, ఒమన్, అమెరికా, యూకే, యూఏఈ, జర్మనీ మరియు చైనా ఉన్నాయి.
హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా విజిట్ వీసా విధానాలను సులభతరం చేయడం పర్యాటక రంగం వృద్ధికి కీలకమైనది. ఖతార్ 102 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. మిగిలిన వారు హయ్యా ప్లాట్ఫారమ్ ద్వారా ఇ-వీసా పొందవచ్చు. గత సంవత్సరం ప్రయాణ, పర్యాటక రంగ GDP సహకారం 31 శాతం పెరిగి QR81.2bnకి చేరుకుంది. ఇది మొత్తం GDPలో 10.3 శాతానికి సమానం అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







