‘అల్ దఖిలియా’లో OMR61.4mn విలువైన పెట్టుబడి అవకాశాలు..!
- August 11, 2024
నిజ్వా: అల్ దఖిలియా గవర్నరేట్లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ విభాగం ప్రస్తుత సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కొత్త వాణిజ్య రిజిస్ట్రేషన్ల నమోదు కోసం 1,410 దరఖాస్తులను స్వీకరించింది. అల్ దఖిలియా గవర్నరేట్లోని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రోత్సాహక శాఖ డైరెక్టర్ హిలాల్ బిన్ బాదర్ అల్ రషీది మాట్లాడుతూ.. వాణిజ్యం, పరిశ్రమలు మరియు ఆహార భద్రత వివిధ రంగాలలో OMR61.4 మిలియన్ల విలువతో 11 పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పెట్టుబడి ప్రాజెక్టులలో పవర్ కనెక్టర్లు, హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, మీట్ ప్రాసెసింగ్ యూనిస్, సిరామిక్ ఫ్యాక్టరీలు, బారికేడ్స్ ఫ్యాక్టరీలు, కండెన్స్డ్ మిల్క్ ఫ్యాక్టరీలు, డైరీ ప్రొడక్ట్స్ మరియు జ్యూస్ ఫ్యాక్టరీ మరియు డేట్స్ ప్యాకింగ్ ఫ్యాక్టరీ వంటి ఇతర నిర్మాణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వివిధ పెట్టుబడి ప్రాజెక్టులకు ఆతిథ్యం ఇవ్వగల అనేక పారిశ్రామిక నగరాలకు అల్ దఖిలియా గవర్నరేట్ కేంద్రంగా ఉందని ఆయన అన్నారు.
పారిశ్రామిక లైసెన్సుల కోసం ప్రాసెస్ చేసిన దరఖాస్తులు ఏడాది ప్రథమార్థంలో 110 లైసెన్సుల వరకు, విదేశీ పెట్టుబడుల రిజిస్ట్రేషన్లు 87, మొత్తం రిజిస్ట్రేషన్లు 674 అని ఆయన చెప్పారు. నిజ్వా ఇండస్ట్రియల్ సిటీ మరియు సుమైల్ ఇండస్ట్రియల్ సిటీలలో ప్రాజెక్ట్ల సంఖ్య పెరిగిందని, ఇది నిజ్వా ఇండస్ట్రియల్ సిటీలో 173 ప్రాజెక్ట్ల పెట్టుబడి విలువ OMR473 మిలియన్లతో ఉండగా, సుమైల్ ఇండస్ట్రియల్ సిటీ OMR160 మిలియన్ల పెట్టుబడి విలువతో 160 ప్రాజెక్ట్లను ఆకర్షించిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









