సెప్టెంబర్ నుండి విద్యా ఉద్యోగులకు ప్రమోషన్లు
- August 12, 2024
మనామా: విద్య మంత్రిత్వశాఖకు చెందిన 5వేల మంది ఉద్యోగులు సెప్టెంబర్ నుండి ప్రమోషన్లను పొందనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ మహమ్మద్ జుమా ప్రకటించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఎకానమీ మరియు సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) సహకారంతో ఈ ప్రక్రియ విజయవంతం అవుతుందన్నారు. డిసెంబరు నెలాఖరులోగా సర్దుబాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పదోన్నతులను మరింత పెంచుతామని డాక్టర్ జుమా తెలిపారు. విద్యా రంగం, సహాయక సిబ్బంది గత విద్యా సంవత్సరంలో అసాధారణంగా పనిచేసినందుకు, రాబోయే సంవత్సరానికి వారి కొనసాగుతున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సేవలను అందించడానికి, విద్యా సంవత్సరాన్ని సజావుగా ప్రారంభించేలా మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







