బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్.!
- August 14, 2024
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుసగా సౌత్లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సౌత్ సినిమాలు హిట్ లిస్టులో చేరుతున్న సంగతీ తెలిసిందే.
అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్కి చాలా చాలా ప్రెస్టీజియస్. సంజయ్ దత్ లక్కు పూరీ జగన్నాధ్కి కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాలి.
ఇండిపెండెన్స్డే కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంజయ్ దత్ మీడియాతో చేసిన చిట్చాట్ ఆకర్షణగా నిలిచింది. ఈ చిట్చాట్లో బాలీవుడ్ సినిమాల్ని వుద్దేశించి సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయ్.
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాస్, యాక్షన్ మిళితమై వుండేది. అందుకే అప్పట్లో సినిమాలు సూపర్ హిట్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు అక్కడ అది మిస్ అవుతోంది. అది సౌత్ సినిమాల్లో కనిపిస్తోంది. అందుకే సౌత్ సినిమాలు దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నాయ్.
బాలీవుడ్కీ తిరిగి అలాంటి వైభవం రావాలని కోరుకుంటున్నా.! ‘డబుల్ ఇస్మార్ట్’లో నా పాత్ర చాలా శక్తివంతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ పూరీ..’ అని సంజయ్దత్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్