మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- August 18, 2024
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025 మహిళల అండర్ -19 ప్రపంచకప్కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. మలేషియా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్కు చేరుకుంటాయి.
సూపర్ సిక్స్కు చేరుకున్న 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్కు చేరుకుంటాయి. సెమీస్, పైనల్తో కలిపి మొత్తం 41 మ్యాచులు జరగనున్నాయి. ఇక భారత జట్టు గ్రూపు-ఏలో ఉంది. భారత్తో పాటు వెస్టిండీస్, శ్రీలంక, మలేసియాలు గ్రూపు-ఏలో ఉన్నాయి.
ఇక గ్రూప్ బిలో ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ లు ఉన్నాయి. గ్రూప్ సిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవాలు గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ ఉన్నాయి.
ఫిబ్రవరి 1 సెమీ ఫైనల్ మ్యాచ్లకు, ఫిబ్రవరి 3 ఫైనల్ రిజర్వ్ డేలు ప్రకటించారు. భారత్ సెమీ ఫైనల్స్కు వెళ్తే జనవరి 31న రెండో సెమీ ఫైనల్ ఆడునుంది. కాగా.. అండర్ 19 స్థాయిలో ఇది రెండో టీ20 ప్రపంచకప్. 2023లో తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!
- యూఏఈలో భారీగా డ్రగ్స్ సీజ్..13మంది అరెస్టు..!!
- ప్రోగ్రామింగ్ లోపం..సౌదీలో హ్యుందాయ్ వెహికిల్స్ రీకాల్..!!
- మే 7వరకు ఒమన్ లో సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు..!!
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!









