క్రిప్టోలో జీతం చెల్లించాలని కంపెనీకి కోర్టు ఆదేశం..!
- August 19, 2024
యూఏఈ: ఒప్పందంలో అంగీకరించిన విధంగా యూఏఈ కరెన్సీ, క్రిప్టోకరెన్సీలో ఉద్యోగి వేతన బకాయిలను చెల్లించాలని దుబాయ్ కోర్టు ఒక కంపెనీని ఆదేశించింది. తనను అకారణంగా ఉద్యోగంలోనుంచి తొలగించారని ఉద్యోగి కంపెనీపై కేసు దాఖలు చేశాడు. 2024లో కేసు నంబర్ 1739లో దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ తీర్పు ప్రకటించింది. ఉద్యోగి ఒప్పందంలో యూఏఈ దిర్హామ్లు, Ecowatt టోకెన్లలో నెలవారీ జీతం చెల్లించాలని ఉంది. ఏకపక్ష తొలగింపు కేసులో ఉద్యోగికి అనుకూలంగా తీర్పు రావడంతో, ఉద్యోగికి వేతనాన్ని ఎకోవాట్ టోకెన్లో కూడా చెల్లించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. వాసెల్ అండ్ వాసెల్ మేనేజింగ్ పార్ట్నర్ మహమూద్ అబువాసెల్ మాట్లాడుతూ. ఆరు నెలలపాటు జీతంలో 5,250 ఎకోవాట్ టోకెన్ భాగాన్ని యజమానులు చెల్లించడంలో విఫలమయ్యారని, ఉద్యోగిని అకారణంగా తొలగించారని ఆరోపించారు. క్రిప్టోకరెన్సీలను ఆమోదయోగ్యమైన సెటిల్మెంట్ మోడ్గా అంగీకరించాలన్న కోర్టు నిర్ణయం యూఏఈ చట్టాల కోసం ఏర్పాటు చేసిన ఫ్రేమ్వర్క్లో డిజిటల్ కరెన్సీలను చేర్చే దిశగా పురోగతిని సూచిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









