క్రిప్టోలో జీతం చెల్లించాలని కంపెనీకి కోర్టు ఆదేశం..!

- August 19, 2024 , by Maagulf
క్రిప్టోలో జీతం చెల్లించాలని కంపెనీకి కోర్టు ఆదేశం..!

యూఏఈ: ఒప్పందంలో అంగీకరించిన విధంగా యూఏఈ కరెన్సీ,  క్రిప్టోకరెన్సీలో ఉద్యోగి వేతన బకాయిలను చెల్లించాలని దుబాయ్ కోర్టు ఒక కంపెనీని ఆదేశించింది. తనను అకారణంగా ఉద్యోగంలోనుంచి తొలగించారని ఉద్యోగి కంపెనీపై కేసు దాఖలు చేశాడు. 2024లో కేసు నంబర్ 1739లో దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తీర్పు ప్రకటించింది. ఉద్యోగి ఒప్పందంలో యూఏఈ దిర్హామ్‌లు, Ecowatt టోకెన్‌లలో నెలవారీ జీతం చెల్లించాలని ఉంది. ఏకపక్ష తొలగింపు కేసులో ఉద్యోగికి అనుకూలంగా తీర్పు రావడంతో, ఉద్యోగికి వేతనాన్ని ఎకోవాట్ టోకెన్‌లో కూడా చెల్లించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. వాసెల్ అండ్ వాసెల్ మేనేజింగ్ పార్ట్‌నర్ మహమూద్ అబువాసెల్ మాట్లాడుతూ. ఆరు నెలలపాటు జీతంలో 5,250 ఎకోవాట్ టోకెన్ భాగాన్ని యజమానులు చెల్లించడంలో విఫలమయ్యారని, ఉద్యోగిని అకారణంగా తొలగించారని ఆరోపించారు. క్రిప్టోకరెన్సీలను ఆమోదయోగ్యమైన సెటిల్‌మెంట్ మోడ్‌గా అంగీకరించాలన్న కోర్టు నిర్ణయం యూఏఈ చట్టాల కోసం ఏర్పాటు చేసిన ఫ్రేమ్‌వర్క్‌లో డిజిటల్ కరెన్సీలను చేర్చే దిశగా పురోగతిని సూచిస్తుందని పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com