హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి...
- June 17, 2016
హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ 2 ఎయిర్ఇండియా విమానాల్లో సుమారు 340 మంది యాత్రికుల చొప్పున జెద్దాకు బయలుదేరుతారన్నారు. చివరి రోజైన ఆగస్టు 28న ఒకే విమానం బయలుదేరి వెళ్తుందన్నారు.హజ్ ప్రార్థనల అనంతరం యాత్రికులు హైదరాబాద్కు అక్టోబర్ 4 నుంచి 11 వరకు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్లో ప్రత్యేక క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్రికులు 2 విడతల చార్జీలను జూలై 2 వరకు చెల్లించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









