భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్తాన్..!
- August 25, 2024
పాకిస్తాన్: భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది.ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే కౌన్సిల్ ఆప్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కు చెందిన నేతలతో పాటు ఇస్లామాబాద్ ను సందర్శించాలని ప్రధాని మోడీకి ఆహ్వానం పంపించింది.
మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్ 370 రద్దు పై పాకిస్తాన్ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది.
ప్రధాని మోడీ అక్కడికీ వెళ్లేందుకు సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. మోడీ బదులుగా భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ ను పంపించే అవకాశమున్నట్టు సమాచారం. గత ఏడాది బిస్కెక్ లో జరిగిన సీహెచ్ జీ సమావేశాలకు భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఈసారి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఏ వివరాలను చెప్పలేమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









