భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్తాన్..!
- August 25, 2024
పాకిస్తాన్: భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది.ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే కౌన్సిల్ ఆప్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కు చెందిన నేతలతో పాటు ఇస్లామాబాద్ ను సందర్శించాలని ప్రధాని మోడీకి ఆహ్వానం పంపించింది.
మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్ 370 రద్దు పై పాకిస్తాన్ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది.
ప్రధాని మోడీ అక్కడికీ వెళ్లేందుకు సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. మోడీ బదులుగా భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ ను పంపించే అవకాశమున్నట్టు సమాచారం. గత ఏడాది బిస్కెక్ లో జరిగిన సీహెచ్ జీ సమావేశాలకు భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఈసారి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఏ వివరాలను చెప్పలేమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు