భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్తాన్..!
- August 25, 2024
పాకిస్తాన్: భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది.ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే కౌన్సిల్ ఆప్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కు చెందిన నేతలతో పాటు ఇస్లామాబాద్ ను సందర్శించాలని ప్రధాని మోడీకి ఆహ్వానం పంపించింది.
మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్ 370 రద్దు పై పాకిస్తాన్ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది.
ప్రధాని మోడీ అక్కడికీ వెళ్లేందుకు సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. మోడీ బదులుగా భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ ను పంపించే అవకాశమున్నట్టు సమాచారం. గత ఏడాది బిస్కెక్ లో జరిగిన సీహెచ్ జీ సమావేశాలకు భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఈసారి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఏ వివరాలను చెప్పలేమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







