భారత ప్రధాని మోడీని ఆహ్వానించిన పాకిస్తాన్..!
- August 25, 2024
పాకిస్తాన్: భారత ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్ తమ దేశానికి ఆహ్వానించింది.ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే కౌన్సిల్ ఆప్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కు చెందిన నేతలతో పాటు ఇస్లామాబాద్ ను సందర్శించాలని ప్రధాని మోడీకి ఆహ్వానం పంపించింది.
మోడీ ఈ సమావేశానికి వెళ్లే అవకాశం లేదని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద దాడులు, ఆర్టికల్ 370 రద్దు పై పాకిస్తాన్ విమర్శల కారణంగా ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య పరిస్థితి క్లిష్టంగా మారింది.
ప్రధాని మోడీ అక్కడికీ వెళ్లేందుకు సిద్దంగా లేనట్టు తెలుస్తోంది. మోడీ బదులుగా భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ ను పంపించే అవకాశమున్నట్టు సమాచారం. గత ఏడాది బిస్కెక్ లో జరిగిన సీహెచ్ జీ సమావేశాలకు భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఈసారి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఏ వివరాలను చెప్పలేమని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









