హాకీ టోర్నమెంట్ లో టీమిండియా కు రజతం..

- June 18, 2016 , by Maagulf
హాకీ టోర్నమెంట్ లో టీమిండియా కు రజతం..

 చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ లో టీమిండియా పురుషుల జట్టు రజతంతో సరిపెట్టుకుంది. వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తుదిపోరులో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలై రజతానికి పరిమితమైంది. టైటిల్ నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్ లో ఆస్ట్రేలియా మూడో గోల్స్ చేసి పైచేయి సాధించగా, భారత్ కు ఒక గోల్ మాత్రమే నమోదు చేసింది. భారత ఆటగాళ్లలో హర్మన్ ప్రీత్ సింగ్ తన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ సాధించగా, ఎస్ కే ఉతప్ప, ఎస్వీ సునీల్, సురేందర్ లు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమయ్యారు. దీంతో ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్ కు వెళ్లిన భారత్ రన్నరప్ గా సరిపెట్టుకుంది.మరోవైపు పటిష్టమైన ఆస్ట్రేలియా అరాన్ జలేస్కీ, డానియల్ బీలే, సిమన్ ఓర్చాడ్ లు తలో గోల్ చేసి విజయంలో ముఖ్యభూమిక పోషించారు.ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా బీలే వేసిన గోల్ నమోదు చేసిన రెండో గోల్ వివాదస్పదమైంది. ఆ గోల్ పై మ్యాచ్ అనంతరం భారత జట్టు నిరసన వ్యక్తం చేయడంతో తుది ఫలితాన్ని ప్రకటించటానికి కాస్త సమయం పట్టింది. ఈ టోర్నీలో 1982లో భారత్ కాంస్య పతకం మాత్రమే సాధించగా, తొలిసారి రజతం సాధించడం విశేషం. భారత్ రజతం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ జట్టు సభ్యులను అభినందించారు. 'చాంపియన్స్ ట్రోఫీలో రజతం సాధించిన హాకీ జట్టుకు అభినందనలు. భారత జట్టు ఫైనల్ కు చేరే క్రమం నిజంగా అద్భుతం. జట్టు ఆటతీరును చూసి యావత్ భారత జాతి గర్విస్తుంది' అని మోదీ తన ట్వీట్ లో ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com