రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ : ఎయిర్ ఏసియా..
- June 18, 2016
సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'కబాలి' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు... తమిళనాడు రాష్ట్ర ప్రజల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అక్కడ 'కబాలి'నే హాట్ టాపిక్. అలాగని బెంగళూరు అభిమానులేం తక్కువ కాదు... వారూ అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకని ఈ చిత్ర బృందం బెంగళూరులోని రజినీ అభిమానులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. చిత్రం విడుదల రోజున ఫస్ట్ డే ఫస్ట్షోకు బెంగుళూరు నుంచి చెన్నైకి ప్రత్యేకంగా ఎయిర్ ఏసియా విమానాన్ని నడుపుతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి.
'కబాలి' చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం ఎయిర్లైన్ అవసరం వచ్చిందట.
ఇందులో భాగంగానే ఎయిర్ ఏసియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఎయిర్ ఏసియా రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది. ఇప్పటికే ప్రయాణికులకోసం కబాలి ప్రత్యేక మెనూ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెంగళూరు - చెన్నై - బెంగళూరు ప్యాకేజిలో రాను పోను టికెట్, సినిమా టికెట్, లంచ్ కూడా కలిసి మొత్తం..రూ.7860. ఇది సినిమా రిలీజ్ అయిన రోజున మాత్రమే సుమా!
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









