‘మత్తు వదలరా 2’.! హిలేరియస్ హిట్ అవుతుందా.?
- August 31, 2024
అప్పుడెప్పుడో వచ్చిన రాజమౌళి వారసుడు శ్రీ సింహా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్గా ఇండస్ట్రీ నోటిలో నానింది.
ఇప్పుడా సినిమాకి సీక్వెల్ రూపొందించారు. అదే ‘మత్తు వదలరా 2’. హిలేరియస్ కామెడీగా రూపొందిన ‘మత్తు వదలరా’ సినిమా అప్పట్లో యూత్ని బాగా అలరించింది.
అందుకు ఏమాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించినట్లు తాజా ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అంతకు మించి అనే రేంజ్లో హిలేరియస్గా ఈ ట్రైలర్ని కట్ చేశారు. శ్రీ సింహాతో పాటూ, కమెడియన్ సత్య ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
వీరిద్దరి కాంబినేషన్తో పాటూ పొడుగు సుందరి ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ పోషించింది. హీరోకి ధీటుగా.. కాదు కాదు, హీరో కన్నా ఎక్కువే పర్పామెన్స్ చేసేసినట్లుంది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేస్తోంది.
అందంగా కనిపిస్తూనే కామెడీ కూడా ఇరగదీసినట్లుంది. అంతే కాదు, ఈ సినిమాలో ఓ పాటను తానే స్వయంగా రాసి పాడుకున్నానని చెబుతోంది ఫరియా అబ్ధుల్లా.
సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ని రితేష్ రానా తెరకెక్కించగా, మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..