‘మత్తు వదలరా 2’.! హిలేరియస్ హిట్ అవుతుందా.?
- August 31, 2024
అప్పుడెప్పుడో వచ్చిన రాజమౌళి వారసుడు శ్రీ సింహా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్గా ఇండస్ట్రీ నోటిలో నానింది.
ఇప్పుడా సినిమాకి సీక్వెల్ రూపొందించారు. అదే ‘మత్తు వదలరా 2’. హిలేరియస్ కామెడీగా రూపొందిన ‘మత్తు వదలరా’ సినిమా అప్పట్లో యూత్ని బాగా అలరించింది.
అందుకు ఏమాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించినట్లు తాజా ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అంతకు మించి అనే రేంజ్లో హిలేరియస్గా ఈ ట్రైలర్ని కట్ చేశారు. శ్రీ సింహాతో పాటూ, కమెడియన్ సత్య ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
వీరిద్దరి కాంబినేషన్తో పాటూ పొడుగు సుందరి ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ పోషించింది. హీరోకి ధీటుగా.. కాదు కాదు, హీరో కన్నా ఎక్కువే పర్పామెన్స్ చేసేసినట్లుంది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేస్తోంది.
అందంగా కనిపిస్తూనే కామెడీ కూడా ఇరగదీసినట్లుంది. అంతే కాదు, ఈ సినిమాలో ఓ పాటను తానే స్వయంగా రాసి పాడుకున్నానని చెబుతోంది ఫరియా అబ్ధుల్లా.
సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ని రితేష్ రానా తెరకెక్కించగా, మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







