‘మత్తు వదలరా 2’.! హిలేరియస్ హిట్ అవుతుందా.?
- August 31, 2024
అప్పుడెప్పుడో వచ్చిన రాజమౌళి వారసుడు శ్రీ సింహా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద హిట్గా ఇండస్ట్రీ నోటిలో నానింది.
ఇప్పుడా సినిమాకి సీక్వెల్ రూపొందించారు. అదే ‘మత్తు వదలరా 2’. హిలేరియస్ కామెడీగా రూపొందిన ‘మత్తు వదలరా’ సినిమా అప్పట్లో యూత్ని బాగా అలరించింది.
అందుకు ఏమాత్రం తగ్గకుండా సెకండ్ పార్ట్ తెరకెక్కించినట్లు తాజా ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అంతకు మించి అనే రేంజ్లో హిలేరియస్గా ఈ ట్రైలర్ని కట్ చేశారు. శ్రీ సింహాతో పాటూ, కమెడియన్ సత్య ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.
వీరిద్దరి కాంబినేషన్తో పాటూ పొడుగు సుందరి ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్ధుల్లా ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ పోషించింది. హీరోకి ధీటుగా.. కాదు కాదు, హీరో కన్నా ఎక్కువే పర్పామెన్స్ చేసేసినట్లుంది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేస్తోంది.
అందంగా కనిపిస్తూనే కామెడీ కూడా ఇరగదీసినట్లుంది. అంతే కాదు, ఈ సినిమాలో ఓ పాటను తానే స్వయంగా రాసి పాడుకున్నానని చెబుతోంది ఫరియా అబ్ధుల్లా.
సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ని రితేష్ రానా తెరకెక్కించగా, మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







