బహ్రెయిన్ లో అవయవ దానానికి గ్రీన్ సిగ్నల్..!
- September 04, 2024
మనామా: బహ్రెయిన్ క్యాబినెట్ మానవ అవయవాల బదిలీ, మార్పిడిపై నిబంధనలను ప్రవేశపెట్టడానికి కీలకమైన మెమోరాండమ్ను ఆమోదించింది. ఆరోగ్య సంరక్షణతోపాటు ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. తాజా నిర్ణయం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రాంతంలో అవయవ మార్పిడిలో బహ్రెయిన్ అగ్రగామిగా నిలిచేందుకు దోహదం చేస్తుందన్నారు.
గత ఏడాది జూన్లో తొలుత ఈ చట్టాన్ని ఎంపీ డాక్టర్ మరియం అల్ ధాన్ ప్రతిపాదించారు. అవయవ దానంకు మద్దతు ఇచ్చే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనితో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతం కావడంతోపాటు మానవ జీవితాలను రక్షించడానికి స్పష్టమైన చట్టం ఏర్పడుతుందని వివరించారు. రాబోయే పార్లమెంటరీ సెషన్లో ఈ కీలకమైన చట్టాన్ని ముందుకు తీసుకురావాలని డాక్టర్ అల్ ధాన్ సూచించారు.
బహ్రెయిన్లో అవయవ దానం నియంత్రణకు చట్టం ఆవశ్యకత గురించి డాక్టర్ అల్ ధాన్ మాట్లాడుతూ.. బహ్రెయిన్లో అవయవ మార్పిడి అనేది రోగుల ప్రాణాలను కాపాడటానికి ఉన్న అతిముఖ్యమైన మార్గమన్నారు. బహ్రెయిన్లో కిడ్నీ, కాలేయ మార్పిడి కోసం వేలాది మంది వేచి చూస్తున్నారని, తాజా చట్టం నిరీక్షణ కాలాన్ని తగ్గింస్తుందని తెలిపారు. ముసాయిదా చట్టం త్వరలోనే అమలులోకి వస్తుందని, బహ్రెయిన్లోని రోగులకు ప్రయోజనాలను అందజేస్తుందని డాక్టర్ అల్ ధాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







