మాదాపూర్, అమీన్పూర్, మల్లంపేటలలో ఆక్రమణలు కూల్చివేస్తున్న HYDRAA
- September 08, 2024
హైదారాబాద్: మాదాపూర్,అమీన్పూర్, మల్లంపేటలలో ఆక్రమణల కూల్చి వెతలను నేటి ఉదయం హైడ్రా చేపట్టింది మాదాపూర్ లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అలాగే బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా.. అమీన్పూర్లోని హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నిర్వహిస్తున్నారు .. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
కాగా, కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం.. దుండిగల్ మల్లంపేట కత్వ చెరువు స్థలంలో శ్రీలక్ష్మిశ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించింది. దీంతో విల్లాల కూల్చివేతకు సిద్ధమైంది హైడ్రా.. శ్రీలక్ష్మిశ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చి వెతలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









