‘మత్తు వదలరా 2’ ట్రైలర్ రిలీజ్..
- September 08, 2024
హైదరాబాద్: కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ కోడూరి హీరోగా మత్తు వదలరా సినిమాతో 2019లో పరిచయమయ్యాడు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన మత్తు వదలరా సినిమా అప్పుడు మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కింది.
మత్తు వదలరా 2 సినిమాలో శ్రీ సింహ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా మత్తు వదలరా 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ కామెడీ థ్రిల్లర్ ట్రైలర్ చూసేయండి..
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









