ముంబైలో చాలా కాస్ట్లీ వినాయకుడు
- September 08, 2024
ముంబై: భారత దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసిన వినాయకుడి మండపాలు దర్శనమిస్తున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుడు కనువిందు చేస్తున్నాడు. అందరూ భక్తి శ్రద్ధలతో లంబోదరుడిని కోలుస్తున్నారు..
అయితే, ఈసారి కూడా వినాయక వేడుకల్లో ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ మహాగణపతి విగ్రహం వార్తల్లో నిలిచింది. దేశంలోనే సంపన్న గణపతిగా పేరొందిన ఈ లంబోదరుడి ఉత్సవాల కోసం నిర్వాహకులు ఈ ఏడాది ఏకంగా రూ. 400 కోట్లతో బీమా చేయించారు.
ఈసారి 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మండపంలోని లంబోదరుడిని ఏకంగా 66 కేజీల బంగారం, 325 కేజీల వెండి ఆభరణాలతో అలంకరించడం జరిగింది. అందుకే ముందుజాగ్రత్తగా ఈ ఉత్సవాలకు రూ. 400.58 కోట్లతో బీమా చేయించామని నిర్వాహకులు ప్రముఖ మీడియా ఏజెన్సీతో చెప్పారు. 2023లో కూడా ఈ గణేశ్ మండపానికి రూ. 360.40 కోట్లకు బీమా తీసుకోవడం జాతీయ స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఇక మండపంలో భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డిజిటల్ లైవ్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటి వాటిని అందుబాటులో ఉంచారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 11 వరకు ఐదు రోజుల పాటు ఈ సంపన్న గణేశుడి వేడుకలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







