తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తోన్న మరో మలయాళ హీరో
- September 11, 2024
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. దాంతో, ప్రపంచం నలుమూలలా తెలుగు సినిమాల గురించీ, తెలుగు సినిమా హీరోల గురించీ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.
అంతేకాదు, తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా గుర్తిస్తున్నారిప్పుడు. అందుకే వివిధ భాషల నుంచి పలువురు ప్రముఖ నటీ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాగా, ఇటీవలే మళయాలంలో స్టార్ అనిపించుకుంటోన్న హీరో టోవినో థామస్ కూడా టాలీవుడ్పై మోజు పెంచుకుంటున్నాడు. తనకు ప్రబాస్, రామ్ చరణ్, ఎన్టీయార్ తదితర తెలుగు హీరోలంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు.
ఛాన్స్ వస్తే, తెలుగు సినిమాల్లో చిన్న రోల్ అయినా చేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెబుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఏఆర్ఎమ్’ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన ముద్దుగుమ్మలు కృతి శెట్టి, ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలోనే టోవినో థామస్ టాలీవుడ్ నుద్దేశించి పై విధంగా వ్యాఖ్యానించారు.
ఈ యంగ్స్టర్ హుషారు చూస్తుంటే, త్వరలోనే ఏదో ఒక తెలుగు సినిమాకి ఓకే చెప్పేసేలానే వున్నాడు. చూడాలి మరి. అన్నట్లు ఈ సినిమాని కృతి శెట్టి డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









