తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తోన్న మరో మలయాళ హీరో
- September 11, 2024
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. దాంతో, ప్రపంచం నలుమూలలా తెలుగు సినిమాల గురించీ, తెలుగు సినిమా హీరోల గురించీ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.
అంతేకాదు, తెలుగు సినిమాని ఇండియన్ సినిమాగా గుర్తిస్తున్నారిప్పుడు. అందుకే వివిధ భాషల నుంచి పలువురు ప్రముఖ నటీ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాగా, ఇటీవలే మళయాలంలో స్టార్ అనిపించుకుంటోన్న హీరో టోవినో థామస్ కూడా టాలీవుడ్పై మోజు పెంచుకుంటున్నాడు. తనకు ప్రబాస్, రామ్ చరణ్, ఎన్టీయార్ తదితర తెలుగు హీరోలంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు.
ఛాన్స్ వస్తే, తెలుగు సినిమాల్లో చిన్న రోల్ అయినా చేయడానికి తాను సిద్ధంగా వున్నానని చెబుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఏఆర్ఎమ్’ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన ముద్దుగుమ్మలు కృతి శెట్టి, ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలోనే టోవినో థామస్ టాలీవుడ్ నుద్దేశించి పై విధంగా వ్యాఖ్యానించారు.
ఈ యంగ్స్టర్ హుషారు చూస్తుంటే, త్వరలోనే ఏదో ఒక తెలుగు సినిమాకి ఓకే చెప్పేసేలానే వున్నాడు. చూడాలి మరి. అన్నట్లు ఈ సినిమాని కృతి శెట్టి డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







