అల్ ఖుసైస్, జెబెల్ అలీ.. అందుబాటులోకి కొత్త బ్రిడ్జులు..!
- September 16, 2024
దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) సెప్టెంబర్ 15న దుబాయ్లో రెండు కొత్త వంతెనలను ప్రారంభించింది. వీటిని గార్న్ అల్ సబ్ఖా-షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ ఇంటర్సెక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించారు. RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ అల్ టేయర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వాహనదారుల ప్రయాణ సమయాన్ని 70 శాతం వరకు తగ్గిస్తుందని తెలిపారు.
మొదటి వంతెన 601 మీటర్లు విస్తరించి, రెండు లేన్లను కలిగి ఉంది. గంటకు 3,200 వాహనాల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది గార్న్ అల్ సబ్ఖా స్ట్రీట్ నుండి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ వరకు తూర్పు వైపు ట్రాఫిక్ ఉత్తరాన అల్ ఖుసైస్, దీరా వైపునకు సులువుగా వెళ్లవచ్చు. ఈ వంతెన ప్రయాణ సమయాన్ని 40 శాతం తగ్గిస్తుంది. పీక్-అవర్ ప్రయాణాన్ని 20 నిమిషాల నుండి కేవలం 12 నిమిషాలకు తగ్గిస్తుంది.
రెండవ వంతెన 664 మీటర్లు. రెండు లేన్లతో గంటకు 3,200 వాహన సామర్థ్యంతో నిర్మించారు. ఈ వంతెన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి దక్షిణాన అల్ యలాయిస్ స్ట్రీట్, జెబెల్ అలీ పోర్ట్ వైపు వచ్చే వాహనాల రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వంతెన వాహనదారుల ప్రయాణ సమయాన్ని 70 శాతం తగ్గిస్తుందని, దీని వల్ల ప్రయాణ సమయం 21 నిమిషాలకు బదులుగా 7 నిమిషాలుగా మారుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ మూడవ చివరి వంతెన అక్టోబరులో ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







