అల్లర్ల ఆరోపణలు: 8 మందికి ఊరట
- June 19, 2016
లేబర్ అకామడేషన్లో గ్రూపుగా ఏర్పడి, అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మందికి కాస్త ఊరట లభించింది. 353,000 దిర్హామ్ల నష్టం ఈ అల్లర్లలో జరిగింది. ఇందులో ముగ్గురు బ్లాక్ స్మిత్స్, ముగ్గురు కార్పెంటర్లు, ఇద్దరు కార్మికులపై అభియోగాలు నమోదయ్యాయి. వందలాది మంది కార్మికుల్ని పోగు చేసి అల్లర్లకు ప్రయత్నించారన్నది వీరిపై ఉన్న అభియోగాల సారాంశం. అల్లర్లలో అనేక వాహనాలు ధ్వంసం కాగా, కార్మాలయం, మెషీనరీ, ఎలక్ట్రానిక్స్ ధ్వంసమయ్యాయి. జనవరిలో జరిగాయి ఈ అల్లర్లు. బాధిత కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ మాట్లాడుతూ, 23 నుంచి 34 ఏళ్ళ వయసున్న సుమారు 300 మంది కార్మికులు ఆందోళన బాట పట్టారనీ, ఆస్తుల్ని ధ్వసం చేశారని, అకామడేషన్లో లిక్కర్ని బ్యాన్ చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు ఈ ఆందోళనలు చేశారని తెలిపారు. అయితే, విచారణ సందర్భంగా సరైన సాక్ష్యాధారాలు చూపకపోవడంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందే ఈ అల్లర్లకు కారణమని నిర్ధారించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే అపీల్ చేసుకోవడానికి 15 రోజుల సమయం ఇచ్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్







