గంజాయి వేప్ స్మగ్లింగ్..అడ్డంగా దొరికిన సోదరులు..10 ఏళ్ల జైలుశిక్ష..!!
- September 24, 2024
మనామా: కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా గంజాయితో నిండిన వ్యాప్లను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు సోదరులకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 36 ఏళ్ల అన్నకు 10 సంవత్సరాల శిక్ష, జరిమానాను కోర్టు విధించింది. అతడికి సహకరించిన 31 ఏళ్ల తమ్ముడికి జరిమానాతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. మొదటి క్రిమినల్ కోర్ట్ తీర్పును వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై వారు అప్పీల్ చేస్తున్నారు. హై క్రిమినల్ అప్పీల్ కోర్టులో సెప్టెంబర్ 29న ఈ కేసుపై విచారణ జరుగనుంది. కాగా, భద్రతా దళాల దర్యాప్తులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో వీరికి నెట్వర్క్ ఉన్నట్లు తేలింది. అనంతరం జరిపిన సోదాల్లో వారి నుంచి పెద్దమొత్తంలో గంజాయి సబంధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |









