గంజాయి వేప్ స్మగ్లింగ్..అడ్డంగా దొరికిన సోదరులు..10 ఏళ్ల జైలుశిక్ష..!!
- September 24, 2024
మనామా: కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా గంజాయితో నిండిన వ్యాప్లను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు సోదరులకు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 36 ఏళ్ల అన్నకు 10 సంవత్సరాల శిక్ష, జరిమానాను కోర్టు విధించింది. అతడికి సహకరించిన 31 ఏళ్ల తమ్ముడికి జరిమానాతో పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. మొదటి క్రిమినల్ కోర్ట్ తీర్పును వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై వారు అప్పీల్ చేస్తున్నారు. హై క్రిమినల్ అప్పీల్ కోర్టులో సెప్టెంబర్ 29న ఈ కేసుపై విచారణ జరుగనుంది. కాగా, భద్రతా దళాల దర్యాప్తులో మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో వీరికి నెట్వర్క్ ఉన్నట్లు తేలింది. అనంతరం జరిపిన సోదాల్లో వారి నుంచి పెద్దమొత్తంలో గంజాయి సబంధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
- విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా
- జూన్ 1 నుంచి దుబాయ్ పార్కింగ్ సేవలపై 5% వ్యాట్...పార్కిన్, సాలిక్ కీలక ప్రకటన
- అబూదాబిలో ప్రారంభం కానున్న సోను నిగమ్ వరల్డ్ టూర్
- హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుబాయ్ ఎయిర్పోర్ట్స్
- గురుదేవ్ నవలను సినిమా చేయాలని నిర్మాత రవి కుమార్ పనసకు సూచన
- రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
- ఇరాన్కు వ్యతిరేకంగా ఉమ్మడి అరబ్ వైఖరి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- 3 రోజుల ఉచిత పార్కింగ్ ప్రకటించిన షార్జా..!!
- షిఫా యాప్ ద్వారా యాత్రికుల కోసం ఐపీఎస్ సేవలు..!!









