ఢిల్లీ నుంచి వారణాసికి మూడు గంటల్లో
- June 20, 2016
మరో బుల్లెట్ రైలు దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ఢిల్లీ నుంచి వయా అలిఘర్,ఆగ్రా, లక్నో,సుల్తాన్ పూర్ మీదగా ఈ రైలు వారణాసికి చేరుకుంటుంది. కాగా ప్రస్తుతం ఢిల్లీ-వారణాసి మధ్య 10 నుంచి 14 గంటల పాటు ప్రయాణ సమయం పడుతోంది. అయితే తాజాగా బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణ సమయం అనూహ్యంగా తగ్గిపోనుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 782 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2గంటల 40 నిమిషాల్లోనే ఈ రైలు చేరుకోనుంది. ఇక ఢిల్లీ నుంచి లక్నోకు కేవలం గంటా 45 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అధ్యయనం చేసిన స్పానిష్ సంస్థ నివేదిక కూడా సమర్పించినట్లు తెలుస్తోంది.
ఈఏడాది చివరికల్లా నివేదిక తుది రూపు దిద్దుకోనుంది. దీనికోసం సుమారు రూ.43,000 కోట్ల వ్యయం కానున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ముంబయి-అహ్మదాబాద్ కారిడార్ మధ్య నడిచే బుల్లెట్ ట్రయిన్ ఇటీవలే ట్రయిల్ రన్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రైలు 2023కి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







