విధుల్లో ఉండగా ప్రమాదం..నలుగురు సైనికులు మృతి..!!
- September 25, 2024
యూఏఈ: డ్యూటీలో ఉండగా జరిగిన ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి చెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సాయుధ దళాల సభ్యులు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 24 సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ వీర జవాన్లను కోల్పోయినందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేసింది. కాగా, ఫిబ్రవరిలో సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో సాయుధ దళాలకు చెందిన నలుగురు సభ్యులతోపాటు ఒక బహ్రెయిన్ అధికారి మరణించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







