విధుల్లో ఉండగా ప్రమాదం..నలుగురు సైనికులు మృతి..!!
- September 25, 2024
యూఏఈ: డ్యూటీలో ఉండగా జరిగిన ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి చెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సాయుధ దళాల సభ్యులు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 24 సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ వీర జవాన్లను కోల్పోయినందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేసింది. కాగా, ఫిబ్రవరిలో సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో సాయుధ దళాలకు చెందిన నలుగురు సభ్యులతోపాటు ఒక బహ్రెయిన్ అధికారి మరణించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







