విధుల్లో ఉండగా ప్రమాదం..నలుగురు సైనికులు మృతి..!!
- September 25, 2024
యూఏఈ: డ్యూటీలో ఉండగా జరిగిన ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి చెందగా, మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు విధులు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సాయుధ దళాల సభ్యులు మరణించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 24 సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపారు. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించి, అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. తమ వీర జవాన్లను కోల్పోయినందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. అమరవీరుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేసింది. కాగా, ఫిబ్రవరిలో సోమాలియాలో ఉగ్రవాదుల దాడిలో సాయుధ దళాలకు చెందిన నలుగురు సభ్యులతోపాటు ఒక బహ్రెయిన్ అధికారి మరణించారు.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









