కువైట్ రాయబారితో సంబంధాలపై భారత మంత్రి చర్చలు..!!
- September 25, 2024
కువైట్: భారతదేశంలోని కువైట్ రాష్ట్ర రాయబారి మెషల్ అల్షెమాలి..భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారు చర్చించారు. రాయబారి అల్షెమాలి మాట్లాడుతూ.. ఆర్థిక, వాణిజ్యం సాంస్కృతిక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. కువైట్లో నివసిస్తున్న భారతీయ ప్రవాస సమాజానికి అందించిన మద్దతు కోసం కువైట్ నాయకత్వానికి భారత మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య బలమైన చారిత్రాత్మక సంబంధాలను రాయబారి ఈ సందర్భంగా గుర్తు చేసారని అధికార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. గత జూన్లో కువైట్లోని మంగాఫ్ నగరంలోని నివాస భవనంలో అగ్నిప్రమాదంలో 49 మంది భారతీయులు మరణించిన సమయంలో భారత మంత్రి కువైట్ను సందర్శించి పరిస్థితిన స్వయంగా సమీక్షించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







