పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పిన తమిళ హీరో కార్తీ.!
- September 25, 2024
తన సినిమా ‘సత్యం సుందరం’ రిలీజ్కి వున్న నేపథ్యంలో తమిళ హీరో కార్తీ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జరిగిన ఓ ఈవెంట్లో ప్రస్తుతం సీరియస్గా నడుస్తోన్నితిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి టాప్ వచ్చింది.
ఆ టాపిక్ చాలా సెన్సిటివ్.. ఇప్పుడు మాట్లాడొద్దు.. అని కార్తీ దాటేయడం, కింద నుంచి అభిమానుల కేరింతలు కొట్టడంతో ఆ ఇష్యూ అక్కడ కామెడీ అయిపోయింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.
దాంతో, ఇది చాలా సీరియస్ ఇష్యూ.. సినీ నటులు ఇలా కామెడీ చేయొద్దు.. అంటూ దీన్ని ఓ ఉద్యమంలా చేపట్టి, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కాస్త గుస్సా అయ్యారు.
దాంతో, కార్తీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తన వుద్దేశ్యం అది కాదనీ, సనాతర ధర్మంపై తనకూ గౌరవముందనీ.. పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు.
కార్తీ పోస్ట్కి పవన్ స్పందిస్తూ.. కార్తి నటించిన సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే, కార్తి సోదరుడు సూర్య కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్కి రెస్పాండ్ అయ్యారు. కార్తి నటించిన ‘సత్యం సుందరం’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









