55 కిలోల కొకైన్ స్వాధీనం.. అరటిపండ్ల రవాణాలో దాచి..అడ్డుకున్న కస్టమ్స్..!!
- September 26, 2024
రియాద్: రాబిగ్ గవర్నరేట్లోని కింగ్ అబ్దుల్లా పోర్ట్లోని జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ అధికారులు 54.8 కిలోల మాదక ద్రవ్యాల కొకైన్ స్మగ్లింగ్ ప్రయత్నాలను విఫలం చేశారు. ఓడరేవు ద్వారా రాజ్యానికి వచ్చిన అరటిపండ్ల రవాణాలో వాటిని దాచి స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. అరటిపండు కంటైనర్లపై అనుమానంతో స్క్రీనింగ్ ద్వారా తనిఖీలు చేయగా.. భారీగా కొకైన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు అథారిటీ తెలిపింది. సెప్టెంబరులో కింగ్ అబ్దుల్లా ఓడరేవు వద్ద ఇది రెండవ అతిపెద్ద డ్రగ్స్ రవాణా. ఈ నెల ప్రారంభంలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC), జకాత్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో 236 కిలోగ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే (1910) లేదా ఇమెయిల్ ([email protected]), అంతర్జాతీయ నంబర్ (00966114208417) ద్వారా తెలిపి ప్రతి ఒక్కరూ సహకరించాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |









