చట్టవిరుద్ధంగా వెబ్సైట్లలో కోల్డ్ప్లే టిక్కెట్లు..అధిక ధరలకు విక్రయం.. హెచ్చరికలు జారీ..!!
- September 26, 2024
యూఏఈ: అబుదాబిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్డ్ప్లే షో కోసం కొన్ని టిక్కెట్లు, ప్రీమియం కేటగిరీ కోసం మొదట ధర Dh995, ఇప్పుడు Viagogo వంటి అనధికార వెబ్సైట్లలో దాదాపు Dh20,000కి మళ్లీ విక్రయిస్తున్నారు. సెప్టెంబరు 25 టిక్కెట్ల ప్రీ-సేల్కు ముందు కచేరీకి వెళ్లేవారికి నిర్వాహకులు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.
గ్రామీ అవార్డ్-విజేత బ్యాండ్ మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్ వరల్డ్ టూర్ 2025లో భాగంగా జనవరి 11, 2025న జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. డిమాండ్ కారణంగా బ్యాండ్ అదే వేదిక వద్ద రెండవ కాన్సర్ట్ షెడ్యూల్ ప్రకటించింది. దాంతో టిక్కెట్లకు డిమాండ్ అధికంగా ఉంది. అధికారిక టికెటింగ్ ప్లాట్ఫారమ్ టిక్కెట్మాస్టర్, వయాగోగో, స్టబ్బ్, గ్రిన్థబ్, డుబిజిల్ వంటి అనధికార రీసెల్లర్ల నుండి కొనుగోలు చేసిన టిక్కెట్లు ఎంట్రీకి చెల్లుబాటు కావని రద్దు చేస్తామని హెచ్చరించింది. అయినా రీ సేల్ ఆగడం లేదు. Dh295 ధర కలిగిన సాధారణ అడ్మిషన్ స్టాండింగ్ టికెట్ ఇప్పుడు Dh1,849 పలుకుతోంది. Dh695 రూబీ కేటగిరీ టికెట్ వయాగోగోలో Dh4,407 అందుబాటులో ఉంది.ఇండియాలో కోల్డ్ప్లే కచేరీ కోసం VIP టిక్కెట్లు వయాగోగోలో Dh27,000(అసలు ధర Dh1,537.48)కి విక్రయిస్తున్నారు. వయాగోగో, గిగ్స్బర్గ్ వంటి పునఃవిక్రయ ప్లాట్ఫారమ్లలో రూ. 2,500 (దిర్హాన్109.82) ధర ఉన్న స్టాండర్డ్ టిక్కెట్లు కూడా రూ.15,000 (దిర్హాం 658.93) వరకు మళ్లీ విక్రయించబడుతున్నాయి. VIP టిక్కెట్లను రూ.35,000 (సుమారు Dh1,537)కి కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని అత్యధికంగా రూ.300,000 (Dh13,178)కి మళ్లీ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, నిర్వాహకుల వ్రాతపూర్వక అనుమతి లేకుండా టిక్కెట్లను తిరిగి విక్రయించడం యూఏఈలో చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |









