ఏపీలో వరదలు..చంద్రబాబు సర్కార్ కోసం రంగంలోకి ప్రపంచ బ్యాంక్ !
- September 26, 2024
అమరావతి: ప్రపంచ బ్యాంకు 2030 నీటి వనరుల ప్రోగ్రామ్ మేనేజర్ మరియు సహజ పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్స్టర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో సమావేశమయ్యారు. వరదలు, కరువు నివారణకు ప్రకృతి ఆధారిత పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించారు. మైక్ వెబ్స్టర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని విధానాన్ని, పకృతి వనరులను కాపాడటంలో ఆయన కున్న చిత్తశుద్ధిని కొనియాడారు.
గతంలో చిత్తూరు జిల్లాలో తమ బృందం పనిచేసిన అనుభవాన్ని, అప్పట్లో తమకు అందిన ప్రోత్సాహన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో తమకు అవకాశం అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వరదలు, కరువు నివారణ కోసం తప్పకుండా కలిసి పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరదలు, కరువు నివారణ చర్యలపై చేపట్టే ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని మైక్ వెబ్స్టర్ హామీ ఇచ్చారు. మైక్ వెబ్స్టర్ హామీ ఇవ్వడం పట్ల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు. షెల్ ఫౌండేషన్ సీఈఓ జోనాథన్ బెర్మాన్ మరియు పోర్ట్ఫోలియో అధిపతి మీరా షాతో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సన్న, చిన్నకారు రైతులు, గ్రామీణ పేదరిక నిర్మూలన (SERP) కార్యకలాపాల గురించి చర్చించారు.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!
- తెలంగాణ భవన్ వద్ద కలకలం..
- సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ
- ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఏపీ ఎన్నార్టీ ధ్యేయం: మంత్రి శ్రీనివాస్