ఉత్తర అల్ బతినాలో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- September 29, 2024
మస్కట్: నార్త్ అల్ బతినా పోలీస్ కమాండ్ నేరం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిలో ఒకరు పదునైన పరికరంతో సహమ్ విలాయత్లోని ఒక పొలంలో కొన్ని ఒంటెలను పొడిచి వాటి మరణానికి కారణం అయ్యాడు. ఒంటె యజమానితో వ్యక్తిగత వివాదాల కారణంగా ఇంతటి దారుణానికి పాల్పడినట్టు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్టు పేర్కొన్నారు.
మరో ఘటనలో దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. “వాణిజ్య దుకాణాల్లోని కార్మికుల బృందాన్ని మోసం చేసినందుకు ఇద్దరు ఆసియా జాతీయులను నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారు అధిక లాభాలను అందజేస్తామని బాధితులను నమ్మించి మోసం చేశారు." అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!