యూఏఈలో 20% తగ్గనున్న బాస్మతీయేతర బియ్యం ధరలు..!!

- September 30, 2024 , by Maagulf
యూఏఈలో 20% తగ్గనున్న బాస్మతీయేతర బియ్యం ధరలు..!!

యూఏఈ: కమోడిటీ పై ఎగుమతి నిషేధాన్ని భారత్ తొలగించిన తర్వాత యూఏఈలో బాస్మతీయేతర బియ్యం ధరలు దాదాపు 20 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాస్మతి, బాస్మతియేతర బియ్యం రెండు మిలియన్ల టన్నులతో యూఏఈకి బియ్యం దిగుమతిలో భారతదేశం అతిపెద్ద భాగస్వామిగా ఉంది.  ఇదిలా ఉండగా, భారతదేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. టన్నుకు $490 (దాదాపు Dh1,800) ధరను నిర్ణయించింది. దక్షిణాసియా దేశంలో మెరుగైన పంటల దిగుబడి కారణంగా ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. సెప్టెంబర్ 28, 2024న భారత వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మార్పు కారణంగా యూఏఈ మార్కెట్‌లో ధరలను దాదాపు 20 శాతం తగ్గే అవకాశం ఉందని అల్ ఆదిల్ సూపర్‌మార్కెట్ల ఛైర్మన్ డాక్టర్ ధనంజయ్ దాతర్ అన్నారు. యూఏఈలో బాస్మతీయేతర బియ్యం అత్యంత వేగంగా అమ్ముడవుతుంది. మార్కెట్ వాటాలో దాదాపు 70 శాతం వాటా కలిగి ఉంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com