యూఏఈలో 20% తగ్గనున్న బాస్మతీయేతర బియ్యం ధరలు..!!
- September 30, 2024
యూఏఈ: కమోడిటీ పై ఎగుమతి నిషేధాన్ని భారత్ తొలగించిన తర్వాత యూఏఈలో బాస్మతీయేతర బియ్యం ధరలు దాదాపు 20 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాస్మతి, బాస్మతియేతర బియ్యం రెండు మిలియన్ల టన్నులతో యూఏఈకి బియ్యం దిగుమతిలో భారతదేశం అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉండగా, భారతదేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. టన్నుకు $490 (దాదాపు Dh1,800) ధరను నిర్ణయించింది. దక్షిణాసియా దేశంలో మెరుగైన పంటల దిగుబడి కారణంగా ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. సెప్టెంబర్ 28, 2024న భారత వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మార్పు కారణంగా యూఏఈ మార్కెట్లో ధరలను దాదాపు 20 శాతం తగ్గే అవకాశం ఉందని అల్ ఆదిల్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ డాక్టర్ ధనంజయ్ దాతర్ అన్నారు. యూఏఈలో బాస్మతీయేతర బియ్యం అత్యంత వేగంగా అమ్ముడవుతుంది. మార్కెట్ వాటాలో దాదాపు 70 శాతం వాటా కలిగి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







