యూఏఈలో 20% తగ్గనున్న బాస్మతీయేతర బియ్యం ధరలు..!!
- September 30, 2024
యూఏఈ: కమోడిటీ పై ఎగుమతి నిషేధాన్ని భారత్ తొలగించిన తర్వాత యూఏఈలో బాస్మతీయేతర బియ్యం ధరలు దాదాపు 20 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాస్మతి, బాస్మతియేతర బియ్యం రెండు మిలియన్ల టన్నులతో యూఏఈకి బియ్యం దిగుమతిలో భారతదేశం అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉండగా, భారతదేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. టన్నుకు $490 (దాదాపు Dh1,800) ధరను నిర్ణయించింది. దక్షిణాసియా దేశంలో మెరుగైన పంటల దిగుబడి కారణంగా ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. సెప్టెంబర్ 28, 2024న భారత వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మార్పు కారణంగా యూఏఈ మార్కెట్లో ధరలను దాదాపు 20 శాతం తగ్గే అవకాశం ఉందని అల్ ఆదిల్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ డాక్టర్ ధనంజయ్ దాతర్ అన్నారు. యూఏఈలో బాస్మతీయేతర బియ్యం అత్యంత వేగంగా అమ్ముడవుతుంది. మార్కెట్ వాటాలో దాదాపు 70 శాతం వాటా కలిగి ఉంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..