యూఏఈలో 20% తగ్గనున్న బాస్మతీయేతర బియ్యం ధరలు..!!
- September 30, 2024
యూఏఈ: కమోడిటీ పై ఎగుమతి నిషేధాన్ని భారత్ తొలగించిన తర్వాత యూఏఈలో బాస్మతీయేతర బియ్యం ధరలు దాదాపు 20 శాతం తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాస్మతి, బాస్మతియేతర బియ్యం రెండు మిలియన్ల టన్నులతో యూఏఈకి బియ్యం దిగుమతిలో భారతదేశం అతిపెద్ద భాగస్వామిగా ఉంది. ఇదిలా ఉండగా, భారతదేశం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని తొలగించింది. టన్నుకు $490 (దాదాపు Dh1,800) ధరను నిర్ణయించింది. దక్షిణాసియా దేశంలో మెరుగైన పంటల దిగుబడి కారణంగా ఎగుమతిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. సెప్టెంబర్ 28, 2024న భారత వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ మార్పు కారణంగా యూఏఈ మార్కెట్లో ధరలను దాదాపు 20 శాతం తగ్గే అవకాశం ఉందని అల్ ఆదిల్ సూపర్మార్కెట్ల ఛైర్మన్ డాక్టర్ ధనంజయ్ దాతర్ అన్నారు. యూఏఈలో బాస్మతీయేతర బియ్యం అత్యంత వేగంగా అమ్ముడవుతుంది. మార్కెట్ వాటాలో దాదాపు 70 శాతం వాటా కలిగి ఉంది.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









