ఏపీలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు : సీఎం చంద్రబాబు
- October 02, 2024
గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో బుధవారం నుంచి చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కడా కూడా చెత్తపన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అందరూ ముందుకెళ్లాలని సూచించారు. 2029కల్లా ఏపీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా కావాలని పిలుపునిచ్చారు.
మచిలిపట్నంలోని నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో రోడ్లపై చెత్త ఉండకూడదని అన్నారు. చెత్త పన్ను రద్దుపై కేబినేట్ తీర్మానం చేస్తామని అన్నారు. పింగళి వెంకయ్య పేరు మీదుగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారని సీఎం ఆరోపించారు. ఆంధ్ర జాతీయకళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని , 2019లో వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తకుప్పలుగా పేరుకుపోయిందని విమర్శించారు. ఈ చెత్తను తొలగించాలంటే రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు.
ఇటీవల విజయవాడను వరద ముంచెత్తినప్పుడు పారిశుద్ధ్య కార్మికుల కృషి వల్లే అంటువ్యాధులు ప్రబల లేదని కొనియాడారు. అనంతరం డంపింగ్ యార్డును చంద్రబాబు పరిశీలించారు. ఆయన వెంట కొల్లు రవీంద్ర , పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







