ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- October 05, 2024
దుబాయ్: మీరు షార్జాకు వెళుతున్నారా. అవును అయితే, వెంటనే షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ను బదులుగా మరో ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిందే. ఎందుకంటే రద్దీగా ఉండే ఆ ప్రధాన రహదారిపై వాహనం బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మేరకు దుబాయ్ పోలీసులు Xలో వెల్లడించారు.ప్రమాదానికి గురైన వాహనం షార్జా వైపు వెళ్తుండగా ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా 6.9కిలోమీటర్లు దాటడానికి 4 నిమిషాల సమయం పట్టే ఈ మార్గంలో ఇప్పుడు వాహనదారులు 35 నిమిషాల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







