ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- October 05, 2024
దుబాయ్: మీరు షార్జాకు వెళుతున్నారా. అవును అయితే, వెంటనే షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ను బదులుగా మరో ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిందే. ఎందుకంటే రద్దీగా ఉండే ఆ ప్రధాన రహదారిపై వాహనం బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మేరకు దుబాయ్ పోలీసులు Xలో వెల్లడించారు.ప్రమాదానికి గురైన వాహనం షార్జా వైపు వెళ్తుండగా ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా 6.9కిలోమీటర్లు దాటడానికి 4 నిమిషాల సమయం పట్టే ఈ మార్గంలో ఇప్పుడు వాహనదారులు 35 నిమిషాల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని దుబాయ్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









