భారతీయుడికి మరణశిక్ష విధించిన కువైట్ ప్రభుత్వం

- June 21, 2016 , by Maagulf
భారతీయుడికి మరణశిక్ష విధించిన కువైట్ ప్రభుత్వం

ఓ హత్య కేసులో చిక్కుకున్న భారతీయ వలసదారుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. అంతేకాక బాధితుడి కుటుంబానికి 5001 కువైటీ దినార్లు(కేడీ) పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. 3 వేల కేడీల రుణం విషయంలో ఓ ఆఫ్గాన్, భారత వలసదారుల మధ్య వివాదం చోటుచేసుకుంది. అది కాస్త ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారతీయుడు ఆఫ్గాన్ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం పరారైన అతడిని స్పాన్సర్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన నిందితుడికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాక బాధితుడి వారసులకు 5001 కేడీలు ఇవ్వాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com