విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు..
- October 06, 2024
అమెరికా: ఘోర ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దట్టమైన పొగలు కమ్ముకోవటంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదపు చేశారు. విమానాశ్రయం సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో మొత్తం 190మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ కు ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానం వెళ్తుంది. అయితే, విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. చూస్తుండగానే మంటలు పెద్దవి అవుతున్న క్రమంలో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.. ఫైరిజన్లు వేగంగా విమానం వద్దకు తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానంలో నుంచి కిందికి తీసుకొచ్చి బస్సులో టెర్మినల్ కు తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతోపాటు విమానాశ్రయ ఉన్నతాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగడంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







