గర్భిణీ స్త్రీలు మెంతి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. సౌదీ డ్రగ్ అథారిటీ..!!
- October 11, 2024
రియాద్: శాస్త్రీయంగా ట్రిగోనెల్లా ఫోనమ్-గ్రేకం అని పిలిచే టానిక్, మెంతికూరను గర్భిణీ స్త్రీలు పెద్ద మొత్తంలో తినకూడదని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) తెలిపింది. అధిక పోషకాలు కలిగిన మెంతులు ఆకలిని ప్రేరేపిస్తాయని, జీర్ణక్రియకు సహాయపడే సాధారణ ఆరోగ్య బూస్టర్గా పనిచేస్తాయని, మెంతులు ప్రసవం తర్వాత మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయని తెలిపారు. అయితే, సిఫార్సు చేయబడిన రోజువారీ 5 నుండి 10 గ్రాములకి పరిమితం చేయబడిందని అధికార యంత్రాంగం గుర్తుచేసింది. మెంతులు మధుమేహం మందులు, రక్తాన్ని పలుచన చేయడం, కొలెస్ట్రాల్-తగ్గించే మందులను పనిచేయకుండా చేసే గుణం ఉందిన SFDA వివరించింది. గర్భిణీ స్త్రీలను పెద్ద పరిమాణంలో ఉపయోగించకుండా హెచ్చరించింది. చిక్పీస్, వేరుశెనగ వంటి చిక్కుళ్లకు అలెర్జీ ఉన్న వ్యక్తులలో మెంతులు కూడా అలెర్జీ ప్రతిచర్యలకు కారణం కావచ్చని పేర్కొంది. రక్తస్రావం పెరిగే ప్రమాదం ఉన్నందున శస్త్రచికిత్స ప్రక్రియలకు కనీసం రెండు వారాల ముందు మెంతికూర వాడకాన్ని నిలిపివేయాలని సూచించింది. మెంతులు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి దుష్ప్రభావాలకు దారితీయవచ్చని హెచ్చరించింది. SFDA తన అధికారిక వెబ్సైట్లో నిషేధించబడిన బ్యూటీ ప్రొడక్ట్లతో పాటు నిషేధించబడిన ఔషధ మూలికలు, మొక్కల జాబితాను పొందుపరిచినట్టు వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







