అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
- October 12, 2024
శబరిమల: ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు.. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
దర్శన సమయాలు
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ మార్పుల ద్వారా భక్తులకు 17 గంటల సుదీర్ఘ సమయం దర్శనానికి లభిస్తుందని అన్నారు..
మండల పూజలు
ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26 వరకు కొనసాగుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనమిస్తుంది.
ఈసారి శబరిమలకు వచ్చే భక్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని తెలిపింది. ఆన్లైన్ బుకింగ్స్ చేసుకున్న భక్తులకు 48 గంటల గ్రేస్ పీరియడ్ను అందిస్తారు. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









