అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
- October 12, 2024
శబరిమల: ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు.. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
దర్శన సమయాలు
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ మార్పుల ద్వారా భక్తులకు 17 గంటల సుదీర్ఘ సమయం దర్శనానికి లభిస్తుందని అన్నారు..
మండల పూజలు
ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26 వరకు కొనసాగుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనమిస్తుంది.
ఈసారి శబరిమలకు వచ్చే భక్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని తెలిపింది. ఆన్లైన్ బుకింగ్స్ చేసుకున్న భక్తులకు 48 గంటల గ్రేస్ పీరియడ్ను అందిస్తారు. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి